వెల్దుర్తి, సెప్టెంబర్ 4: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మానేపల్లి గ్రామంలో మానేపల్లి, అందుగులపల్లి, మహ్మద్నగర్తండా పంచాయతీల పరిధిలోని 127 మంది నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని, ఎవరు అధైర్యపడవద్దని అన్నారు. మానేపల్లి నుంచి ఉన్న ప్రధాన రోడ్డును వెడల్పు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్లను సైతం మంజూరు చేస్తానని గ్రామస్తులకు హామీనిచ్చారు.
ఇన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్పై ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని విమర్శలు, అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి, సర్పంచ్లు వెంకటలక్ష్మి, సుజాత, వినోద, ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, సోమప్ప, రాజులు, శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి, కృష్ణ, పెంట్యా, గొల్లశ్రీను, నాయకులు, ఆయా గ్రామాల ఆసరా లబ్ధిదారులు, బీడీ కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.
నేడు చెక్కుల పంపిణీ
మండల కేంద్రమైన వెల్దుర్తి శ్రీబాలాజీ గార్డెన్లో నూతన ఆసరా పింఛన్ పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను నేడు ఎమ్మెల్యే మదన్రెడ్డి అందజేస్తారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 49 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నారని వివరించారు.