డీఆర్డీవో పీడీ శ్రీనివాస్
రామాయంపేట, జూన్ 2: ప్రభుత్వం మహిళాభ్యున్నతికి ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, ఏపీడీ భీమయ్య, డీపీఎం మోహన్ అన్నారు. బుధవారం రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్లో మహిళా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో స్త్రీనిధి ద్వారా తీసుకున్న లక్ష రూపాయల రుణంతో ఇస్తారాకుల పరిశ్రమను సర్పంచ్ జ్యోతితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జ్యోతి, ఉపసర్పంచ్ సుధాకర్రెడ్డి, ప్రకాశ్ వెంకట్, ఏపీఎం రాములు, నాగరాజు, సీసీ వెంకట్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సారెడ్డి, వార్డు సభ్యులు ఉన్నారు.