కొల్చారం/నర్సాపూర్/శివ్వంపేట/కౌడిపల్లి/చిలిపిచెడ్, ఫిబ్రవరి 4 : వచ్చే ఏడాది లోపు కాళేశ్వరం నీటితో సింగూరు డ్యాం, ప్రతి చెరువు, కుంటలను నింపుతామని,ఏనాడు మంజీరా నది ఎండిపోదని చిలిపిచెడ్ మండలంలోని రైతులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి భరోసానిచ్చారు. శుక్రవారం చిలిపిచెడ్ రైతు వేదికలో నయబ్ తహసీల్దార్ ఆదర్శ్కుమార్ అధ్యక్షతన ఆయా గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు.ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. కౌడిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాలవత్ రాజునాయక్, జడ్పీటీసీ కవిత అంబర్సింగ్, మండలాధ్యక్షుడు రామాగౌడ్ ఉన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజులతో కలిసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్రావు, డిప్యూటీ తహసీల్దార్ దిలీప్కుమార్, గిర్దావర్ శ్రీహరి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, మెదక్ ఏఎంసీ వైస్చైర్మ న్ సావిత్రిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ చైర్మన్ దేవేందర్రెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలం బద్రియ తండాకు చెందిన రామావత్ అనిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెం దాడు. మృతుడి కుటుంబానికి మంజూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. శివ్వంపేట మండలాధ్యక్షులు రమణాగౌడ్, మండల కోశాధికారి బండారి గంగాధర్లతో కలిసి విద్యుత్షాక్తో మృతిచెందిన బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల బీమా చెక్కులను అందజేశారు. నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ దేవేందర్రెడ్డి తో కలిసి టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి మృతి చెందిన 22 మంది కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ నేతలు ఉన్నారు.
సమష్టి కృషితోనే మున్సిపల్ అభివృద్ధ్ది చెందుతుందని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణం నుంచి వెల్దుర్తి వెళ్లే మార్గంలో డంపింగ్ యార్డ్ వరకు మెటల్ రోడ్డుకు ఎమ్మెల్యే మదన్రెడ్డి భూమిపూజ చేశారు. రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవెందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరీ, టీఆర్ఎస్నేత అశోక్గౌడ్ ఉన్నారు.