స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంటింటా జాతీయజెండాలు రెపరెపలాడుతున్నాయి. జాతీ య సమైక్యతా భావం, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలించేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నివర్గాలు వేడుకల్లో భాగం అవుతున్నాయి. శుక్రవారం జాతీయ సమైక్యతా రక్షాబంధన్ దివస్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు అనాథ, అంగన్వాడీ, గురుకులాల చిన్నారుల మధ్య వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నారులకు రాఖీలు కట్టి, స్వీట్లు పంచారు. చిన్నారులను ఆప్యాయంగా పలుకరించి వారితో ఉల్లాసంగా గడిపారు. చిన్నారులకు దుప్పట్లు, స్వెట్టర్లు, స్వీట్లు, పండ్లు అందజేశారు. పలుచోట్ల మహిళా ప్రజాప్రతినిధులు, పారిశుధ్య మహిళా కార్మికులు సీఎం కేసీఆర్ కటౌట్లకు రాఖీలు కట్టారు.
-సంగారెడ్డి/మెదక్ జిల్లాల నెట్వర్క్, ఆగస్టు 12