పటాన్చెరు, జూలై 30 : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నియోజకవర్గవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అమీన్పూర్ మండలం, బీరంగూడ వాసి, ప్రస్తుతం లండన్ నగరానికి చెందిన సోలిహుల్ మెట్రోపాలిటన్ సిటీ సెల్ మెసెలీ ఉడ్వార్డు కౌన్సిలర్ శేషేంద్ర శేషబట్టర్ అన్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. శనివారం పటాన్చెరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం వారు పలు విషయాలపై చర్చించారు. ఇటీవల నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2.30లక్షల నోటు పుస్తకాలు అందించడాన్ని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు లండన్ వేదికగా అనేక ఉద్యమాలు చేసినట్లు గుర్తుచేశారు. దాని ఫలితమే నేడు నా మిత్రుడు ఎన్ఆర్ఐ కుర్మాచలం క్యాబినెట్ ర్యాం కు గల తెలంగాణ ఫిల్మ్చాంబర్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనట్లు ఎమ్మెల్యేతో తెలిపారు. లం డన్లో కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శేషేంద్ర శేష బట్టర్ను అభినందించి, సన్మానించారు. కార్యక్రమంలో స్టేట్ టీచర్స్ యూనియన్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ పాల్గొన్నారు.