నర్సాపూర్, జూలై18: నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తం గా 8 మండలాలకు మనఊరు-మనబడి కార్యక్రమానికి రూ. 30.06కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనఊరు-మనబడి ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూ రు చేశారని వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 128 పాఠశాలలు ఉన్నాయని అందులో 401టాయ్లెట్స్, 73 కిచెన్షెడ్, 17650 మీటర్ల కంపౌండ్ వాల్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ చేకూరుతుందని స్పష్టం చేశారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే మదన్రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మండల పరిధిలో చిన్నచింతకుంట గ్రామానికి చెందిన రాజుగౌడ్కు రూ. 26000, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అర్జున్కు రూ. 16000 సంబందించిన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, ఏఎమ్సీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీధర్గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, టీఆర్ఎస్ యువజన నాయకుడు రవీందర్గౌడ్ పాల్గొన్నారు.
మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
పట్టణ శివారులో మల్లికార్జునస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూ జలు చేశారు.
మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
శివ్వంపేట, జూలై18: శివ్వంపేట మాజీ సర్పంచ్ పులిమామిడి స్రవంతి నవీన్కుమార్గుప్తా మాతృమూర్తి అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవారం శివ్వంపేటలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించి ఓదార్చారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సీనియర్ నాయకులు గొర్రె వెంకట్రెడ్డి, పైడి శ్రీధర్గుప్తా, వంజరి కొండల్, కొడకంచి రవీందర్గౌడ్, వర్రె శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ముద్దగల్ల లక్ష్మినర్సయ్య, నారాయణ, దర్శన్ పాల్గొన్నారు.