సంగారెడ్డి జూలై 18 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ స్థానిక ఐటీఐ విద్యార్థులకు నైఫుణ్య శిక్షణ అందజేస్తున్నది. హైదరాబాద్లో ప్రత్యేకంగా సెంట్రల్ వర్క్షాపును ఏర్పాటు చేశారు. అధునాతన యంత్రాలతో పాటు సీఎన్సీ యంత్రాలు, లేజర్ కటింగ్ మిషన్లను అందుబాటులో ఉంచారు. అధునాత న యంత్రాలపై ఐఐటీ విద్యార్థులు పని చేస్తారు. ఇందుకోసం ఉచిత స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సులను ఐఐటీ హైదరాబాద్ సోమవారం ప్రారంభించింది.
ఇతర ఇంజినీరింగ్ కళాశాల్లో విద్యనభ్యసిస్తున్న మెకానికల్, సివిల్, డిజైన్, ఇండస్ట్రియల్, కెమిస్ట్రి విద్యార్థులకు సెంట్రల్ వర్క్షాపులో ప్రాక్టికల్ అందజేయనున్నారు. స్టార్టప్ కంపెనీలు చెల్లింపుల పద్ధతిలో ఈ వర్క్షాపు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్ మానవాళికి అవసరమైన నూతన సాంకేతికను ఆవిష్కరించేందుకు పని చేస్తున్నట్లు తెలిపారు. ఐటీఐ, ఇంజినీరింగ్ విద్యార్థులు ఉపయోగించుకుని, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొదించుకునే అవకా శం కల్పిస్తున్నట్లు చెప్పారు.
సెంట్రల్ వర్క్షాపు ఇన్చార్జి కె.బద్రినాథ్ మాట్లాడుతూ ఈ వర్క్షాప్ ఐటీఐ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ లేజర్ కటింగ్, ఫ్యాబ్రికేషన్, అధునాతన సీఎన్సీ మిషన్లపై పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మారుతి సుజుకి వీ2ఎక్స్, టీహాన్, జెర్మ్సేఫ్, క్రిస్టల్బాల్, మనాలి స్వింగ్స్ స్టార్టప్ కంపెనీ కోసం హైటెక్ ఫ్యాబ్రికేషన్లు చేసినట్లు చెప్పారు.