పెద్దశంకరంపేట, జూన్25: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన జొన్నలు విక్రయించేందుకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి నియోజకవర్గంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి మద్ధతు ధర ప్రకటించి జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, సర్పంచ్ సత్యనారాయణ, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేశ్గౌడ్, ఎంపీటీసీ వీణా సుభాశ్గౌడ్, సీఈవో రవీందర్, కోఆప్షన్ సభ్యులు సాజీత్, నాయకులు వెంకట్రెడ్డి, అశోక్, రవీందర్, పున్న య్య, కిషన్, అంజయ్య , అంజిరెడ్డి, తదితరులున్నారు.