మెదక్ మున్సిపాలిటీ, మే 27 : పిల్లలు, యువత శారీరక దారుఢ్యం, మానసికోల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా పట్టణాల్లోని ప్రతి వార్డులో క్రీడా ప్రాంగాణాలను ఏర్పాటు చేయాలని ఈ నెల 18న నిర్వహిచిన పల్లె, పట్టణ ప్రగతి సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందులో భాగంగా క్రీడా ప్రాంగాణాలను ఏర్పాటు చే యాలని మున్సిపల్ కమిషనర్లకు ఈ నెల 21న సీడీఎంఏ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, ఎకరా స్థలం అందుబాటులో ఉన్నది. మూడు వార్డుల్లో స్థలాల ను గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజు నాటికి క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవడానికి మున్సి పల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 5 వేల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేషన్లలో డివిజన్కు రెండు, మున్సిపాలిటీల్లో వార్డుకు ఒకటి చొప్పున క్రీడా మైదానాలను ఏర్పాటు చే యాలని భావిస్తున్నది. అయితే, అన్ని వార్డుల్లో స్థలం అం దుబాటులో ఉండకపోతే అక్కడి పరిస్థితి అనుగుణంగా నడుచుకోవాలని, ఇందుకు పట్టణ ప్రగతి నిధులు ఖర్చు చేయాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించాలని, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్దేశించినది. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా.. 9వ వార్డులో షాదీఖానా వద్ద, 11వార్డులోని వెంకట్రావ్నగర్ కాలనీలో, 13 వార్డులోని మీరానగర్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు స్థలాలను ఇప్పటికే గుర్తించారు. ఇంకా ఏయే వార్డుల్లో స్థలాలు ఉన్నాయో? గుర్తించే పనిలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు.
క్రీడా ప్రాంగణంలో ఉండే సౌకర్యాలు..
క్రీడా ప్రాంగణంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టు, లాంగ్జంప్ పిట్, పారలాల్ ఎక్సర్సైజ్ బార్, గ్రౌండ్ లెవలింగ్, జంగిల్ క్లీనింగ్, ఎంఎస్ గేట్ ఆర్చ్ ఉంటాయి. పిల్ల లు, యువకులు, మహిళలు రోజూ వ్యాయామం చేసుకు నేలా సమీపంలో ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు.
పట్టణంలో స్థలాలను గుర్తిస్తున్నాం..
మెదక్ పట్టణంలో క్రీడా మైదానాల ఏ ర్పాటుకు స్థలాలను పరిశీలించి, మూడు స్థ లాలను గుర్తించాం. పాత పట్టణంలోని వా ర్డుల్లో స్థలాలు లేవు. కొన్ని వార్డుల్లో స్థలా లు ఉన్నా సమస్యలు ఉన్నాయి. నూతనం గా ఏర్పడిన కాలనీల్లో క్రీడా మైదానాల స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీహరి, మున్సిపల్ కమిషనర్
సీఎం కేసీఆర్ నిర్ణయం బాగున్నది
క్రీడా మైదానాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాగున్నది. మైదానాల తో పిల్లలు, యవకులు శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కల్పించాలి. పట్టణంలో మూడు మైదానాలను గుర్తించాం. మరిన్ని మైదానాలను గుర్తించి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – టి.చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్