నర్సాపూర్, జూలై 30 : నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధ్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం చైర్మన్ మురళీయాదవ్ అధ్యక్షతనలో మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యేతోపాటు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధ్ది పనులు కొనసాగుతున్నాయని, మిగతా పనులను ఆగస్ట్టు 2న శంకుస్థాపన చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కె ట్, వైకుంఠధామం, గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ము మ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. మున్సిపల్ భవనాన్ని ఐబీ వద్ద నిర్మిస్తామని, వైశ్య భవనం, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. పాత మున్సిపల్ భవనం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. కొన్ని వార్డు ల్లో తాగునీటి సమస్య ఉన్నందున కొత్తగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు. రజకుల కోసం దోబీఘాట్ల్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తామని వివరించారు. మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ మాట్లాడుతూ అభివృద్ది పనులను ప్రారంభించి, మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగితే, వాటి ని పరిశీలించి తొలిగిస్తామని, ఇప్పటివరకు నిర్మించిన నిర్మాణాలపై పన్ను విధిస్తామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ నయీమొద్దీన్, కమిషనర్ చాముండేశ్వరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
‘డబుల్ బెడ్రూం’ కాలనీకికేసీఆర్ నగర్ పేరు
– తూప్రాన్ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం
తూప్రాన్, జూలై 30 : డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీకి కేసీఆర్నగర్గా నామకరణం చేస్తూ తూప్రాన్ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తూప్రాన్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీని కేసీఆర్నగర్గా మార్పు చేశారు. నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్లోకి పాత మార్కెట్ తరలించా లని నిర్ణయించారు. 9వ వార్డు ప్రజల కోరిక మేరకు మున్సిపాలిటీ విలీన గ్రామం రావెళ్లికి సరైన రోడ్డు లేదు. రోడ్డు సమస్య తీర్చడానికి సర్వే నెంబరు 288లో నక్ష ద్వారా గ్రామానికి లింకు రోడ్డు నిర్మించడంతోపాటు ఇతర అభివృద్ధ్ది పనులు చేపడుతా మని చైర్మన్ వివరించారు. ఎజెండా అంశాలను పరిశీలించి ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కమిషనర్ మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.