మెదక్, జూన్ 22 : భూమిపై పడే ప్రతి వర్షపు నీటి చుక్క ను ఒడిసి పట్టుకొని, సంరక్షించుకోవడంతోపాటు పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ హరీశ్ తెలిపారు. వాన నీటి సంరక్షణపై జలశక్తి అభియాన్ కమిటీ ప్రథమ సమావేశాన్ని మంగళవారం కాన్ఫరెన్స్ హాల్లో 13 శాఖల అధికారులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని వాన నీటి ని సంరక్షించడానికి అన్నిశాఖల అధికారులు సమన్వయంగా పని చేయాలని సూచించారు. భవనాలపై పడిన వర్షపు నీటిని సేకరించడానికి రూఫ్ టాప్ పద్ధతిలో ఇంకుడు గుంతల నిర్మా ణం, మైదాన పల్లపు ప్రాంతాల్లో కందకాలు తవ్వించాలన్నా రు. వాననీటి సంరక్షణకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కొల్చా రం మండలకేంద్రంతోపాటు హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ను ఎంపిక చేసినట్లు తెలిపారు.
పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతి ప్రభుత్వ భవనాల ఆవరణలో ఇంకుడు గుంత లు నిర్మిస్తామన్నారు. నీటి సంరక్షణ నిర్మాణానికి రూ.25 వేలు, ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.8వేలు కేటాయిస్తా మన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జలశక్తి అభియాన్లో సెప్టెంబర్లోగా నీటి సంరక్షణ నిర్మాణాలకు జియో ట్యాగింగ్ చేస్తామని వివరించారు. అటవీ ప్రాంతాల్లో వాన నీటిని సంరక్షించే స్ట్రెన్చెస్, చెక్డ్యాం నిర్మాణాలు చేపట్టాలని జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్వో)కు కలెక్టర్ సూచించారు. ఫాంపాండ్స్ నిర్మాణాలను ఉద్యానశాఖ ఏర్పా టు చేయాలన్నారు. జల సంరక్షణలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ కింద ఉన్న 2,516 చెరువుల్లో పూడికతీత చేపట్టి, 15 చెక్డ్యామ్లు నిర్మిస్తామని తెలిపారు. కాళేశ్వరం కాల్వల పనులు వేగంగా జరుగుతున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు.
వాననీటిని సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించ డానికి చెక్డ్యాంలు, కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. చెరువు కాల్వల్లో చెత్తాచెదారం తొలిగించుట, చెరువుల్లో పూడికతీత, చెరువుల పునరుద్ధరణ, సంప్రదాయక బావులు, బోర్లను రీఛార్జి చేయ డం, చెరువులు, కుంటల భూములను పరిరక్షించడానికి పను లు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాన నీటి సంరక్షణ సాధ్యమన్నారు. నీటి సంరక్షణకు ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన పనులు చేపట్టాలని డీఆర్డీవో, పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీల్లో కొత్తగా నిర్మిం చే కట్టడాలకు ఇంకుడుగుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. వాననీటి సంరక్షణపై ప్రజలను చైతన్యపరిచే అన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు, ప్రజలతో మానవహారాలు, ర్యాలీలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని డీఈవో, సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీపీఆర్వోకు సూచించారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీసీఈవో శైలేశ్, డీఎఫ్వో జ్ఞానేశ్వర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్, పంచాయతీరాజ్, ఉద్యానవనశాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.