రామాయంపేట/చేగుంట, జూన్ 15: రాష్ట్రప్రభుత్వ పెట్టుబడి సా యం రైతులకు సీజన్ ముందే ఖా తలో జమచేయడంతో రైతులు సంబురాల్లో మునిగితేలారు. మం గళవారం రామాయంపేట, చేగుం ట, నార్సింగి, నిజా ంపేట మండలాలలో సీఎం కేసీఆర్చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసి స్వీట్లను పంచుకున్నారు. ఝాన్సీలింగాపూర్లో రై తుబంధు మండల శాఖ అధ్యక్షుడు నర్సారెడ్డి, సర్పంచ్ జ్యోతి అధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. రామాయంపేట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మ న్ సరాఫ్ యాదగిరిల నేతృత్వంలో టీఆర్ఎస్ కార్యర్తలు స్వీట్లు పంచుకున్నారు. చేగుంటలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రజనకు ప్రవీణ్కుమార్, నార్సింగి మండలంలో పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తౌర్యానాయక్ అధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట,జూన్15: కరోనా కష్ట సమయం లో రైతులకు రైతుబంధు పథకం నేరుగా సీఎం కేసీఆర్ బ్యాంకుఖాతాలో డబ్బులు జమ చేయడంతో రైతులు పెద్దశంకరంపేటలో మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా సీఎం కేసీఆర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చిత్రపటాలకు మండల ప్రజాప్రతినిధులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, మం డల టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీపంతులు, మండల రైతుబంధు అధ్యక్షుడు సు రేశ్గౌడ్, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, కోఆప్షన్ సభ్యులు యాదూల్, పట్టణ సర్పం చ్ సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ఉన్నారు.
నిజాంపేట..
నిజాంపేట,జూన్15: వానకా లం పంటల సాగుకు ప్రభు త్వం రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయం నేరుగా రైతు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుదనిజిల్లా అధ్యక్షుడు స్వామి అన్నారు. కార్యక్రమం లో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్అజిజ్,పీఏసీఎస్ డైరెక్టర్ స్వామిగౌడ్,ఆత్మకమిటీ మెంబర్ నాగరాజు ఉన్నారు