మెదక్, జూన్ 15 : జిల్లాలో చెరువులు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.హరీశ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చెరువుల పరిరక్షణపై రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 589 చెరువులకుగాను రెవెన్యూ, నీటి పారుదల, ఆర్వీ అసోసియేట్ సమన్వయంతో 526 చెరువుల సర్వే పనులు పూర్తి చేసి 156 చెరువులకు సంబంధించి ప్రాథమికంగా నోటిఫైడ్ చేశామన్నారు. మిగతా 63 చెరువుల సర్వేతోపాటు 370 చెరువుల ప్రిలిమినరీ నోటిఫికేషన్కు తగి న చర్యలు తీసుకోవాలని చెప్పారు. తహసీల్దార్లు ప్రాథమిక దశలో నోటిఫై చేసి నో టీస్ బోర్డుపై పెట్టి అభ్యంతరాలు రాని యె డల అట్టి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. సర్వే స మయంలో ఎఫ్టీఎల్ సర్వే నంబర్లు సరిగ్గా ఉన్నా యో.. లేవో చూడాలని, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎఫ్టీఎల్ కూడా తేడా రావద్దన్నారు. చెరువుల పరిరక్షణ బాధ్యత తహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
శిఖం భూములు కబ్జా కాకుండా చూడాలని, అన్యాక్రాంతమైతే నోటీసు ఇచ్చి ఆర్డర్ పాస్ చేయాలన్నారు. అవసరమైతే వాల్టా చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి కట్టడాలను తొలగించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, డీఎస్పీ కృష్ణమూర్తి, నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్రావు, డీపీవో తరుణ్కుమార్, డీఎఫ్వో జ్ఞానేశ్వర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు గంగ య్య, మిషన్ భగీరథ అధికారి కమలాకర్, ఇతర అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.