నర్సాపూర్, జూన్14: మహిళ సంఘాల సభ్యులకు నూతన వ్యాపారం చేసుకోడానికి ప్రభు త్వం ప్రోత్సాహకం అనే పథకా న్ని ప్రవేశపెటట్టారని జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి భీమ య్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రా మ సంఘం సహాయకుల సమీ క్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య మాట్లాడుతూ జిల్లాలో 2610 కొత్తగా ఉత్పత్తి, వ్యాపార , సేవా రంగాల్లో ఆసక్తి గల మహిళా సంఘాల సభ్యులకు ప్రతి గ్రామానికి 5 గురు మహిళలకు అవకాశం కల్పించామని వెల్లడించారు. నర్సాపూర్ మండలానికి 152 యూనిట్లను గుర్తించామన్నారు. ఈ నెల చివరి వరకు గ్రౌండింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మోహ న్, ఏపీఎం గౌరీశంకర్ పాల్గొన్నారు.