చేర్యాల, జూలై 14 : వర్షాలు తగ్గాలని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం పూజలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేయా లని సీఎం కేసీఆర్ దేవాదాయశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అదేశాల మేరకు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆల య ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో వరుణ దేవుడిని ప్రార్థిస్తూ ఆలయ అర్చకులు, ఆగమ పాఠశాల విద్యార్థులు ‘ఓం సహస్ర నేత్రాయ విద్యహే వజ్రహస్తాయ థీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్’ అనే మంత్రం పటిస్తూ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.