గజ్వేల్, జూలై 14: గజ్వేల్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి నాయకులు, ఉన్నతాధికారులు గజ్వేల్ అభివృద్ధిని చూసి వెళ్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కనిపిస్తాలేదా అని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
దేశంలోని పలు రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వెళ్తున్నారని తెలిపారు. గజ్వేల్ను ఆదర్శంగా తీసుకొని వారి రాష్ర్టాల్లో సంక్షేమ పథ కాలు, అభివృద్ధి పనులను అమలు చేస్తున్నారన్నా రు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లో అభివృద్ధి శూన్యమని చెప్పడం వారి గుడ్డితనానికి నిదర్శనమన్నా రు. గజ్వేల్లో రూ.140కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఔటర్ రింగురోడ్డు పనులు కొనసాగుతున్నాయన్నారు. గజ్వేల్లోని సమీకృత కార్యాలయాల భవన సముదాయం, ఎడ్యుకేషన్ హబ్, మహతి ఆడిటోరియం, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉందా.. కాం గ్రెస్ హయాంలో గజ్వేల్లో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. గజ్వేల్లో అవినీతి జరిగిందంటున్న బీజేపీ నాయకులు నిరూపించాలని సవాల్ విసిరారు. గజ్వేల్లో ఈటల, మోదీ ఎవరు పోటీ చేసినా ఓడిస్తా మన్నారు. రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు బాలమణీశ్రీనివాస్రెడ్డి, ఉప్పల మెట్టయ్య, గోపాల్రెడ్డి, రజిత, చందు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.