నర్సాపూర్, డిసెంబర్ 20 : కుల ధ్రువీకరణ పత్రం మార్చుకొని అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకొని టీచర్గా బోరంచ అశ్విని అనే మహిళ ఎంపికైనట్లు మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు మాధవి కలెక్టర్కు ఫిర్యాదు చేసిం ది. ఈ విషయంపై కలెక్టర్ గ్రామంలో విచారణ చేపట్టాలని జడ్పీ సీఈవో శైలేశ్కుమర్ను ఆదేశించారు.
మంగళవారం సీతారాంపూర్ గ్రామంలో సర్పం చ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి అంగన్వాడీ టీచర్ పోస్ట్ బీసీ-సీ కులం రిజర్వ్ చేసినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది. గ్రామానికి చెందిన బోరంచ అశ్విని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నియామకమైంది. అంగన్వాడీ టీచర్ అశ్విని ఎస్సీ కులానికి చెం దిందని, బీసీ-సీ కులధ్రువీకరణ పత్రం పొంది అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నదని, ఈ నియామకాన్ని రద్దు చేయాలని మాధవి కలెక్టర్కు ఫిర్యాదు చేసింది.
ఈ విషయంపై గ్రామంలో విచారణ చేపట్టగా, క్రిస్టియన్ మతంలోకి మారినట్లు సర్టిఫికెట్తో రెవెన్యూశాఖ ద్వారా బీసీ-సీ సర్టిఫికెట్ పొందినట్లు అంగన్వాడీ టీచర్ అశ్విని వెల్లడించింది. ఉద్యోగం కోసమే తాను క్రిస్టియన్ మతంలోకి మారినట్లు చెప్పింది. అంగన్వాడీ టీచర్ నియామకంపై పలు అనుమానాలు ఉన్నాయని, ఇంకా ఆధారాలు సేకరిస్తామని, తమకు సమ యం కావాలని సీఈవోను గ్రామస్తులు కోరారు. జడ్పీ సీఈవో మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియామకం జరిగిందని తెలిపారు. విచారణ చేపట్టి పూర్తి వివరాలను సేకరించినట్లు చెప్పారు. నివేదికను కలెక్టర్కు అందజేస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట సీడీపీవో హేమభార్గవి, డిఫ్యూటీ తహసీల్దార్ నవీన్, ఎస్సై గంగరాజు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.