సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 12: కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్కు అర్జీదారుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 42 మంది తమ సమస్యల అర్జీలను అధికారులకు అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ అర్జీలను వెంట నే పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అర్జీలను వెంటనే పరిశీలించి ఆయా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్కు వస్తున్నారని, క్షేత్ర స్థాయి నుంచి త్వరితగతిన పరిష్క రించాలని స్పష్టంచేశారు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రజావాణి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మహిపాల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
మెదక్లో..
మెదక్ అర్బన్, డిసెంబర్12: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని ఆర్డీవో సాయిరాం అధికారులకు సూచించారు. ప్రజావాణిలో డీఎస్వో శ్రీనివాస్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో 33 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 23 ఫిర్యాదులు భూ సమస్యలకు సంబంధించినవి, పోడు భూములకు సంబంధించి 3, పింఛన్లు, డబుల్బెడ్రూం, వైద్య, ఆరోగ్యశాఖ, తదితర వాటికి సంబంధించి 6, మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి ఒక అర్జీ వచ్చింది. అటవీ హక్కుల చట్టం కింద హక్కులు కల్పించినా పట్టా పాస్బుక్ రాలేదని, ఇప్పించాల్సిందిగా కౌడిపల్లి మండలం దేవులపల్లి క్యాడం చంద్రకళ కోరారు. రోడ్డు మాస్టర్ ప్లాన్లో షాపు కోల్పోయిన తనకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని, ఇంతవరకు ఇవ్వలేదని ఇప్పించాలని వెల్దుర్తి గ్రామానికి చెందిన నోముల రమేశ్ కోరాడు. అర్జీ పరిశీలించాల్సిందిగా తహసీల్దార్ను ఆదేశించారు. సర్వే నెంబర్ 204లో సాగు చేస్తున్న 2 గుంటల అటవీ భూమి కబ్జాకు గురైందని, ఇప్పించాల్సిందిగా చిలిపిచెడ్ మండలం గౌతాపూర్ గన్యాతండాకు చెందిన గుగులోత్ దోలి ఫిర్యాదు చేశారు. జిల్లా నలుమూలల నుంచి పలు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు.