మెదక్ అర్బన్, డిసెంబర్12: ఆప్డెట్ చేసిన ఆధార్కార్డ్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలసి జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు అన్ని రంగాలో ్ల ఆధార్కార్డ్ అడుగుతున్నారన్నారు. 2014కు ముందు ఆధార్ పొంది ఇంతవరకు అప్డేట్ చేయని వారు వెంటనే నవీకరణ చేసుకోవాలన్నారు.
వెయ్యి ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను గుర్తించి ప్రయోజనాలు కల్పించడం, బ్యాంక్ ఖాతాలు తెరవడం, రుణ దరఖాస్తులు చేసుకోవడం, ఉపకార వేతనాలు, పింఛన్లు, రేషన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీకి అనుసంధానం, ఆదాయపన్ను చెల్లింపు తదితర అన్నింటీకి ఆధార్ సులభతరం చేస్తుందన్నారు. ఆధార్లో పేరు, పుట్టిన తేది, చిరునామా వంటి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సలహాలు, సహాయం కోసం 1947 టోల్ఫ్రీకి కాల్ చేయాలని, లేదా help<\@>uidai.gov.inకు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
ఆధార్ను మానిటరింగ్ చేయడానికి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 21 మండలాలలకు చిలిపిచెడ్, హవేళీఘనపూర్, నిజాంపేట్ మండలాల్లో ఇంకా ఆధార్ ఎన్రోల్మెంట్ పూర్తిగా కాలేదన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఆధార్కు సంబంధించిన మోసపురిత కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్న, ఆదాయ ముదింపు చేయాలన్న ఓటరు కార్డుకు అనుసంధానం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల్రావు, డాక్టర్ నవీన్, తపాలా శాఖ, మహళా శిశు సంక్షేమం, విద్యాశాఖ అధికారులు, ఈడీఎం సందీప్ పాల్గొన్నారు.
ఇన్నోవేషన్ చాలెంజ్ను సద్వినియోగం చేసుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 12: స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. స్టేట్ ఇన్నోవేషన్, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఐడియా కాంపిటీషన్ పోస్టర్ను సోమవారం ఆమె చాంబర్లో డీఈవో రమేశ్కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సెక్టోరియల్ అధికారి సుభాశ్, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ రామేశ్వర ప్రసాద్తో కలిసి ఆవిష్కరించారు.