మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 12: తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్-2022 రాష్ట్రస్థాయి పోటీలకు 32 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, మధుసూదన్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జెండాఊపి ప్రారంభించారు.
మెన్స్ 10 కిలో మీటర్ల విభాగంలో అర్జున్, తిరుపతి, నరేశ్, రామకృష్ణ, చైతన్య, దేవీసింగ్, ఉమెన్స్ విభాగంలో నందిని, దివ్యశ్రీ, సరిత, రాజేశ్వరీ, చిట్టి, సంజుల ఎంపికయ్యారు. అండర్-20 (8 కి.మీ) బాలుర విభాగంలో రాజేశ్, ముఖేశ్, చిన్న, హరీశ్, నరేశ్, పరశురాం, బాలికల విభాగంలో బబిత, సవిత, వసంత, జ్యోతిక, సావిత్రి, సోనాబాయ్ ఎంపికయ్యారు.
అండర్-18 (4 కి.మీ)బాలుర విభాగంలో గజేంద్ర, ముజంబర్, బాలికల విభాగంలో గంగ, కావ్యలు ఎంపిక కాగా, అండర్-16 (2 కి.మీ) బాలుర విభాగంలో సుశాంత్రెడ్డి, పవన్, బాలికల విభాగంలో ప్రియాంక, నేహాప్రతిక ఎంపికయ్యారు. వీరు ఈనెల 18న మహబూబాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులకు మెదక్ రూరల్ సీఐ విజయ్ పతకాలు బహూకరించారు. ఈ ఎంపికల్లో మాస్టర్ అథ్లెటిక్స్ కార్యదర్శి రాజేందర్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాస్రావుతో పాటు పీడీ మాధవరెడ్డి, పీఈటీలు మహిపాల్, స్వప్న, వినోద్, చంటి తదితరులు పాల్గొన్నారు.