మెదక్, (నమస్తే తెలంగాణ)/ రామాయంపేట, డిసెంబర్ 10 : సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ చరిత్రలో నిలిచి పోతారని, బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాయంపేటలో ఆయన మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చారిత్రాక అవసరమన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజల మనస్సును గెలిచాయన్నారు. మన పథకాలు దేశమంతా వ్యాపిస్తాయన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశంలో రైతురాజ్యానికి పునాది పడినట్లుగా పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తమ రాష్ర్టాల్లో అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నట్లు గుర్తు చేశారు. సమావేశం లో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, నాయకులు సరాఫ్ యాదగిరి, పుట్టి యాదగిరి, గజవాడ నాగరాజు, దేమె యా దగిరి, సిద్ధయ్య, సిద్ధిరాంరెడ్డి, బాపురెడ్డి, లక్ష్మీపతి ఉన్నారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఇఫో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన దొంతి శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో, రాయిన్పల్లి గ్రామానికి చెందిన ఈగ భిక్షపతి కరెంట్ షాక్తో మృతి చెందారు. ఇద్దరికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో రూ.2లక్షల చొప్పున రూ.4లక్షల ప్రమాదబీమా మంజూరైనది. ఈ మేరకు మెదక్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దొంతి శ్రీను భార్య యశోద, ఈగ భిక్షపతి భార్య పుష్పమ్మకు బీమా చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దేదేందర్రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ భరోసా ఇస్తుందని, ప్రతి కార్యకర్త ను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కిష్టయ్య, రాయన్పల్లి సర్పంచ్ సిద్ధాగౌడ్, మెదక్ మారెట్ కమిటీ డైరెక్టర్ సాయిలు, నాయకులు చింతల నర్సింహులు, ఉమర్, నాగరాజు ఉన్నారు.