నారాయణఖేడ్, డిసెంబర్ 10: నియోజకవర్గంలోని తండాల రోడ్లను అభివృద్ధి చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 39 తండాల రోడ్లకు రూ.46.21 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నిధులతో నియోజకవర్గంలో 69.75 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చెందనున్నాయన్నారు.
నారాయణఖేడ్ మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బాలునాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.62 లక్షలు, హంగిర్గ(కె) నుంచి లాల్సింగ్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ. కోటి, అబ్బెంద నుంచి మల్పరేగడి తండా వరకు బీటీ రోడ్డుకు రూ. 2.09 కోట్లు, అనంతసాగర్ నుంచి మియాపూర్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.32 కోట్లు, హంగిర్గ(కె) నుంచి శ్యామానాయక్ తండా వరకు రూ.1.03 కోట్లు, చాప్టా(కె) నుంచి టోల్యా తండా వరకు బీటీ రోడ్డుకు రూ. 2.26 కోట్లు, సిర్గాపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి చల్లగిద్ద తండా వరకు బీటీ రోడ్డుకు రూ.37 లక్షలు, ఎన్హెచ్ 161బీ నుంచి ఈదులకుంట తండా వరకు బీటీరోడ్డుకు రూ.40 లక్షలు, ర్యాలమడుగు నుంచి మాణిక్నాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.49 లక్షలు,
మనూరు మండలంలో రాణాపూర్ నుంచి మాయికోడ్ వరకు బీటీ రోడ్డుకు రూ.1.97 కోట్లు, రాణాపూర్ నుంచి మన్యానాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.97 కోట్లు, కల్హేర్ మండలంలో ఎన్హెచ్ 161 నుంచి శెకలికుంట తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.34 కోట్లు, మునిగేపల్లి నుంచి నాన్యనాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.64 లక్షలు, సిర్గాపూర్ మండలంలో వంగ్దాల్ నుంచి గైరాన్ తండా వకు బీటీ రోడ్డు, హై లెవెల్ బ్రిడ్జికి రూ.1.90 కోట్లు, పొట్పల్లి నుంచి పొట్పల్లి తండా వరకు బీటీరోడ్డుకు రూ.1.70 కోట్లు, బీటీ రోడ్డు నుంచి అంతర్గామ్ వరకు బీటీరోడ్డుకు రూ.90 లక్షలు, వాసర్ ఆర్అండ్బీ రోడ్డు నుంచి బిబ్యా తండా వరకు బీటీరోడ్డుకు రూ.70 లక్షలు, ఇరక్పల్లి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సూర్య తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.72 కోట్లు,
కంగ్టి మండలంలో కంగ్టి నుంచి పర్తు తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.20 కోట్లు, నాగూర్(బి) నుంచి పొమ్యానాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.92 కోట్లు, కంగ్టి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సాధుతండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.72 కోట్లు, నాగన్పల్లి నుంచి దుగ్గానాయక్ తండా వరకు బీటీరోడ్డుకు రూ.68 లక్షలు, చౌకన్పల్లి నుంచి జీర్గితండా వరకు బీటీరోడ్డుకు రూ.67 లక్షలు, తుర్కవడగామ నుంచి చింతామణి తండా వరకు బీటీరోడ్డుకు రూ.16 లక్షలు, బీటీ రోడ్డు నుంచి భీంరా తండా వరకు రూ.1.08 కోట్లు, బీటీ రోడ్డు నుంచి రాంసింగ్ తండా వరకు బీటీరోడ్డుకు రూ.2.64 కోట్లు,
చాప్టా నుంచి తుకారాం తండా వరకు బీటీరోడ్డుకు రూ.1.12 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి చాప్టా(బి) తండా వరకు బీటీ రోడ్డుకు రూ.33 లక్షలు, నాగల్గిద్ద మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి దామరగిద్ద బిక్యానాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.75 లక్షలు, కరస్గుత్తి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ముక్టాపూర్ గోప్యానాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.37 కోట్లు, కారాముంగి నుంచి శ్యామానాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.30 కోట్లు, గోప్యానాయక్ తండా నుంచి పీర్యానాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.30 కోట్లు, నాగల్గిద్ద నుంచి శ్యామానాయక్ తండా వరకు బీటీ రోడ్డుకు రూ.1.50 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి చోకియా తండా వరకు బీటీ రోడ్డుకు రూ.66 లక్షలు, ఇరక్పల్లి నుంచి కారోబారి తండా వరకు బీటీ రోడ్డుకు రూ.2.45 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గురుసింగ్ తండా వరకు రూ.60 లక్షలు,
పెద్దశంకరంపేట మండలంలో ఎన్హెచ్ 161 నుంచి ధరావత్ తండా వరకు రూ.49 లక్షలు, మల్కాపూర్ నుంచి తమ్మలికుచ్చ తండా వరకు రూ.1.31 కోట్లు, వీరోజిపల్లి నుంచి రామ్లానాయక్ తండా వరకు రూ.54 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా పనులకు సంబంధించి త్వరలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలో రూ.35.75 కోట్ల నిధులతో తండాలకు బీటీ రోడ్లతో పాటు తండాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతిని కాంక్షించి సీఎం కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు కృతజ్ఞతలు తెలిపారు.