శివ్వంపేట, డిసెంబర్ 10 : మండలంలో నేరాలతోపాటు అసాంఘిక కార్య కలాపాలను అదుపు చేసేందుకు పోలీసులు నడుం బిగించారు. అన్ని గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నా రు. సీసీ కెమెరాల ఏర్పాటకు గ్రామస్తులను పోలీసులు ప్రోత్సహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ ఏర్పాటు చేస్తున్న నిఘా నేత్రాలు నేరాలకు అడ్డుకట్టవేయడానికి దోహదపడుతున్నాయి.
సీసీకెమెరాల ఏర్పాటుతో దొంగతనాలు, నేరాలు చేయడానికి భయపడుతున్నారు. పోలీసులు గ్రామాల్లో అవగాహన సదస్సు లు నిర్వహంచారు. నవాబ్పేట, గూడురు, ఇసురికపల్లి, చండి, శివ్వంపేట, బిజిలీపూర్ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు వచ్చారు. ఇటీవల నవాబ్పేటలో ఎస్పీ రోహిణిప్రియదర్శిణి సీసీకెమెరాలను ప్రారంభించారు. తూప్రాన్ సీఐ శ్రీధర్, ఎస్సై రవికాంత్రావు ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీకెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నారు. నేరాలు నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి.
దాతలు ముందుకు రావాలి
గ్రామాల్లో ప్రజల రక్షణ కోసం ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తు న్నాం. ఇందుకు దాతలు సహకరిం చాలి. సీసీ కెమెరాలు ఏర్పాటుతో ప్రజలు ధైర్యంగా ఉండవచ్చు. గ్రామాల్లో జరిగే దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.
– నింగ రాజు, అల్లీపూర్, శివ్వంపేట
నేరాలు తగ్గుతున్నాయి
గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, ప్రజలకు సీసీకెమెరాల ఏర్పాటుపై అ వగాహన కల్పిస్తున్నాం. దాతలు, ప్ర జాప్రతినిధుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గ్రామాల్లో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. సర్పంచ్లు, దాతల సహకారంతో మండలంలో వంద శాతం సీసీకెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను పూర్తిగా నియంత్రిస్తాం.
– రవికాంత్రావు, శివ్వంపేట ఎస్సై