పెద్దశంకరంపేట, నవంబర్ 26 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దశంకరంపేట పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో సీఎం కేసీఆర్ ఆసరాగా ఉంటున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పెద్దశంకరంపేటలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని మాధవానగర్ కాలనీ, బ్యాగరిగల్లి, ఉప్పరిగల్లిలో రూ. 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 75వ రాజ్యాంగ అవతరణ దినోత్సవ ప్రతిజ్ఞలో హాజరై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, తహసీల్దార్ చరణ్, సర్పంచ్ల ఫోరం మండలా ధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దత్తు, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేశ్గౌడ్, ఎంపీటీసీలు వీణా సుభాశ్గౌడ్, వేణుగోపాల్గౌడ్, శంకర్గౌడ్, సలీం పాల్గొన్నారు.