రామాయంపేటరూరల్, నవంబర్ 25: ఆంధ్రలో ఉపా ధి దొరకక తెలంగాణకు వచ్చి ఉపాధి పొందుతున్నా డు. యాసంగి, వర్షకాలం వరి కోత సీజన్లో ఉపాధి దొరుకుతున్నదని ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఎర్రకుంటకు చెందిన యువకుడు రమేశ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం రమేశ్ మండలంలో ని లక్ష్మాపూర్ గ్రామంలో టార్పాలిన్లు(టాపర్లు) అద్దెకు ఇస్తూ ఉపాధి పొందుతున్నా డు. ఒక టార్పాలిన్కు ఒక రోజుకు 10 నుం చి 15రూపాయల వరకు అద్దె తీసుకోవడం జరుగుతున్నది. ఒక రోజు సుమారు 50 నుంచి 75వరకు అద్దెకు ఇస్తానని తెలిపారు. అంతే కాకుండా ఒక్కో రైతు వీటిని కనీసం 10 నుంచి 20రోజుల వరకు వడ్లు ఆరే వరకు తీసుకుంటున్నారు. అతని ఆదాయం నెలకు సుమారు 30వేలకు పైగా లభిస్తోం ది. ఈ సమయంలో గిరాకీ వస్తున్నదని అతని వద్ద రామాయంపేట మండలం బాపనయ్య మోత్కుల తండాకు చెంది న గణేశ్ అనే యువకుడిని దినసరి కూలీగా చేర్చుకొని ఉపా ధి చూపిస్తున్నాడు. తాను ఆరు సంవత్సరాల నుంచి వీటిపై నే ఆధారపడి జీవిస్తున్నానని, సీజన్ అయిన తరువాత సొంత ఊరికి వెళ్తానని తెలిపాడు.
తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు
తెలంగాణ ప్రజలు ఎంతో అదృష్టవంతు లు. ఇక్కడ అన్ని రకాల ఉపాధి, ఆదాయా మా ర్గాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన నాకే ఆ దాయం లభిస్తున్న తెలంగాణలో ఇక్కడి ప్ర జలకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అర్థం అవు తున్నది. కేవలం ఒకే రకమైన ఉపాధి కాకుండా చా లా రకాల ఆదాయ మార్గాలు తెలంగాణలో ఉంటాయని ఆంధ్రలో అంటుంటే నమ్మలేదు. ఇప్పుడు స్వయంగా చూస్తున్న.
– రమేశ్, ఉపాధి పొందుతున్న ఆంధ్ర యువకుడు