మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 20 : ముఖ్యమంత్రి సహా యనిధి పేదలకు వరం అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ నియోజకవర్గంలో వివిధ మండలాల్లోని లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులతో పాటు ముగ్గురికి రూ. 5లక్షలు విలువ చేసే ఎల్వోసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం సహాయనిధితో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ టీఆర్ఎస్ మండల నాయకుడు అంజగౌడ్, సాంబశివరావు, కిష్టయ్య, పాపన్నపేట నాయకులు పాల్గొన్నారు.
పేదల పాలిట వరం సీఎంఆర్ఎఫ్
నర్సాపూర్ : సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట వరంగా మారిందని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన రాజాగౌడ్ పేరున రూ. 60వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు అయింది. ఎమ్మెల్యే మదన్రెడ్డి జక్కపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ఎంతోమంది పేదల కుటుంబాల్లో సంతోషం నింపుతున్నదన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, జడ్పీటీసీ బాబ్యానాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
పేద ప్రజలకు అండగా..
కౌడిపల్లి : పేదింటి ప్రజలకు సీఎం రిలీఫ్ఫండ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. కౌడిపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను అందజేశారు. కౌడిపల్లి గ్రామానికి చెందిన ఇట్టబోయిన లక్ష్మణ్కు రూ. 60వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిలుమల నర్సింహారెడ్డి, కాలేరు శివాంజనేయులు, రామాగౌడ్, శ్రీనివాసరావు, చంద్రం శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.