బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయకపోగా, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని గాంధీ థీమ్పార్క్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ, ట్రయాంగిల్ సర్కిల్, జిమ్, దేశీ దంగల్, లయన్స్క్లబ్ సొంత భవనాలను మంత్రి హరీశ్రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎస్పీ రమణ, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్, చింతా ప్రభాకర్లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి బీజేపీ కండ్లు మండుతున్నాయన్నారు. 15వ ఆర్థిక సంఘం రాష్ర్టానికి ఇవ్వమన్న రూ. 5,300 కోట్ల నిధులు కేంద్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలవ్వడం లేదని అన్నారు. త్వరలోనే పటాన్చెరులో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పటాన్చెరు/ పటాన్చెరు టౌన్, అక్టోబర్ 2: ధరలు పెంచడం, ఆస్తులు అమ్మడం కేంద్రంలో ఉన్న బీజేపీకి అదే పనిగా ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరులో గాంధీ థీమ్ పార్క్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ, ట్రయాంగిల్ సర్కిల్, జిమ్, దేశీ దంగల్, లయన్స్ క్లబ్ భవనాలను ఎంపీ కొత్త ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, చేనేత సహకార సంఘం చైర్మన్, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు చింతా ప్రభాకర్తో కలసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దుసుకుపోతున్నదన్నారు. జాతి పిత మహాత్మాగాంధీ అడుగు జాడల్లో తాము నడుస్తున్నామన్నారు.
గాంధీజీకి విగ్రహాలు కట్టడం చూశానని, కానీ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఏకంగా గుడి కట్టారని అభినందించారు. లాయర్గా గాంధీజీకి ఎన్నో అవకాశాలు వచ్చినా ఆయన కేవలం పేద, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న నష్టం చూసి దేశానికి స్వాతంత్య్రం కావాలని పోరాడారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా తెలంగాణ పేదల హక్కుల కోసం తొలి, మలి ఉద్యమాల్లో పోరాడారన్నారు. ఈ మధ్య కొందరు గాంధీజీని కించపరుస్తున్నారని, వారి సంకుచిత మనసును చాటుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుల పేరిట పటాన్చెరులో విగ్రహాలు పెడుతున్నారని మహిపాల్రెడ్డి మంత్రి అభినందించారు. కరోనా సమయంలో అద్భుతంగా పని చేసిన పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులకు విగ్రహాలు పెట్టడం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. పార్క్లో పెట్టిన బుల్ కళాఖండం అద్భుతంగా ఉందన్నారు. అభివృద్ధిలో పటాన్చెరు దూసుకుపోతున్నదనే సందేశాన్ని ఇస్తున్నదని అన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యేనే దీనికి కారణమన్నారు.
అవార్డులివ్వడంలోనూ కేంద్రానిది సంకుచిత మనస్తత్వం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన అవార్డులపైననూ తన సంకుచిత మనస్తత్వాన్ని చాటుకుంటున్నదని మంత్రి అన్నారు. రెగ్యులేటరీ, క్వాలిటీ, క్వాంటిటీ విభాగాల్లో జల్ జీవన్ మిషన్ వారు మిషన్ భగీరథ నీటి పథకానికి అవార్డు ఇస్తే ఇప్పుడు బీజేపీ నాయకుల హైరానా పడిపోయి ఇచ్చిన అవార్డు కొంత పరిధి వరకే అని చెబుతున్నారని మండిపడ్డారు. అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందిన తెలంగాణకు అవార్డులు వస్తాయని అర్థమై, ఇప్పుడు అవార్డులే రద్దు చేసే దశకు చేరారని ఎద్దేవా చేశారు. కేంద్రం నీతి అయోగ్ మిషన్ భగీరథకు ఇవ్వమన్న రూ.19వేల కోట్లు ఇవ్వడం లేదు ఎందుకని నిలదీశారు. 15వ ఆర్థిక సంఘం ఇవ్వనున్న రూ.5,300 కోట్లు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో అవార్డులు సరే మాకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుంటే ఎలా అన్ని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న స్కీంలు బీజేపీకి కండ్లలో మంట పెడుతున్నాయన్నారు. ప్రజలకోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. కేంద్రం దేశాన్ని అభివృద్ధి చేయడం లేదన్నారు. ధరలు పెంచడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ఇవే కేంద్రం చేస్తున్న పనులన్నారు.
చేనేత రంగాన్ని నిర్వర్యీం చేస్తున్న కేంద్రం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని మంత్రి విమర్శించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేషనల్ హ్యాండ్లూమ్, హ్యాండీక్రాప్ట్ బోర్డును రద్దు చేసిందన్నారు. నూలుపై సబ్సిడీని సహితం రద్దు చేసి చేనేత రంగాన్ని దెబ్బ తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం చేనేత కార్మికుల ఉసురు పోసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నన్నారు. చేనేత కార్మికులకు బీమా సౌకర్యం, పింఛన్ అందజేస్తున్నారని తెలిపారు. వరంగల్లో 1200 ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎస్పీ రమణకుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీఎస్పీ భీంరెడ్డి, తహసీల్దార్ మహిపాల్రెడ్డి, కార్పొరేటర్లు భీంరెడ్డి, సింధు ఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్యాదవ్, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, రోజా బాల్రెడ్డి, అమీన్పూర్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, ఎంపీపీలు ఈర్ల దేవానంద్, వినయ్ విజయభాస్కర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, కుమార్గౌడ్, సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు బేగరి పాండు, కౌన్సిలర్ కొల్లూరి మల్లేశ్, కోఆప్షన్ మెంబర్ యునూస్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జైపాల్, చంద్రారెడ్డి, వెంకట్రెడ్డి, గూడెం మధుసూదన్రెడ్డి, మెరాజ్ఖాన్, మగ్దుం, ఆదర్శ్రెడ్డి, నగేశ్, వెంకటేశంగౌడ్, కొలన్ బాల్రెడ్డి, తొంట అంజయ్యయాదవ్, రామకృష్ణముదిరాజ్,రవి, అజ్మత్, అక్రమ్ పాష, సంజీవ్ పాల్గొన్నారు.
త్వరలో 250 పడకల దవాఖాన
పటాన్చెరులో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించడానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లో పద్మశాలీలకు కోకాపేట్లో రూ.150 కోట్లతో ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించి ఇస్తున్నాం. పటాన్చెరులో పద్మశాలీలకోసం ఆత్మగౌరవ భవనం నిర్మించి ఇస్తాం. త్వరలోనే స్థలం కేటాయించేలా చూస్తాం. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకోసం చేసిన త్యాగాలు కొనియాడదగినవి. పద్మశాలీలకు ఎప్పుడూ అండగా ఉంటాం.
– తన్నీరు హరీశ్రావు. వైద్యారోగ్యశాఖ మంత్రి
అభివృద్ధిలో దూసుకెళ్తున్నది
పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అన్ని నియోజకవర్గాలకు భారీగా నిధులు మంజురు అవుతున్నాయి. బాపూజీ థీమ్ పార్క్ చాలా బాగుంది. మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉంది. పద్మశాలీల ఆత్మగౌరవం కాపాడేందుకు సీఎం కేసీఆర్ కోకాపేట్లో స్థలం కేటాయించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం వద్దనే జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు భావితరాలు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ కులాలను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ అన్ని కులాలకు తగిన న్యాయం చేస్తున్నారు. దీంతో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి.
– కొత్త ప్రభాకర్రెడ్డి, ఎంపీ, మెదక్
మహనీయుల విగ్రహాలతో స్ఫూర్తి
మహాత్మాగాంధీ, కొండా లక్ష్మణ్ బాపూజీలకు గాంధీ జయంతి రోజే పటాన్చెరులో విగ్రహావిష్కరణ చేయడం అభినందనీయం. దేశ స్వాతంత్య్రం కోసం ఒక బాపూజీ పోరాడితే, తెలంగాణ రాష్ట్రం కావాలని బాపూజీ పోరాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాన్ని తెలంగాణ కోసం ధారపోశారు. కొండా లక్ష్మణ్ అడ్వకేట్గా చాకలి ఐలమ్మ కేసు కొట్లా డి ఒక్క రూపాయి ఫీజు తీసుకోలేదు. పేద, పీడిత, బలహీన వర్గాల గొంతుగా బాపూజీ ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆత్మగౌరవ భవనం ఇచ్చారు. తెలంగాణలో అన్ని కులాలకు న్యాయం జరుగుతున్నది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. పటాన్చెరులో పద్మశాలీలకు ఆత్మగౌరవ భవనం కోసం స్థలం కేటాయిస్తుండడాన్ని అభినందిస్తున్నా.
– ఎల్.రమణ, ఎమ్మెల్సీ
సీఎం సహకారంతోనే అభివృద్ధి
సీఎం కేసీఆర్ సహకారంతోనే అభివృద్ధి పనులు వేగవంతం చేశాను. మంత్రి హరీశ్రావు ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాం. మహాత్మాగాంధీ థీమ్ పార్క్ను సర్వాంగ సుందరంగా నిర్మించాం. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నాం. త్వరలోనే రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్క్ను ప్రారంభించాల్సి ఉంది. పటాన్చెరు ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పనులు చేయగలుగు తున్నా. దాతలు, అధికారులు అండగా ఉంటున్నారని ప్రగతి పనులు కనిపిస్తున్నాయి. గతంలో కంటే ఇప్పటి పటాన్చెరు చాలా అభివృద్ధి చెందింది. ప్రజల దీవెనలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.
– గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు