శివ్వంపేట, అక్టోబర్ 2 : స్వరాష్ట్రం సాధించుకున్నాకే సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన శివ్వంపేటలో జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలను పూజించే సంస్కృతి తెలంగాణలోనే ఉందన్నారు.
అంతకుముందు గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు పెద్ద ఎత్తున పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. డీజే పాటలకు యువతుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమం అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. జడ్పీటీసీ ఏర్పాటు చేసిన 12 అడుగుల బతుకమ్మ అందరినీ ఆకట్టుకున్నది. అనంతరం శివ్వంపేటలోని పెద్దచెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్గుప్తా, పబ్బరమేశ్గుప్తా, ఉసిరికపల్లి సర్పంచ్ బాబూరావు, స్థానిక ఉపసర్పంచ్ పద్మా వెంకటేశ్, సిలివేరు వీరేశం, గౌరీశంకర్, పోచాగౌడ్, కొండల్, లక్ష్మీనర్సయ్య, షేక్అలీ, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.