మెదక్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగా ణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన మహనీయుడు తెలంగాణ స్ఫూర్తిప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని మెదక్ అదననపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం 107వ జయంతిని పురస్కరించుకొని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో కలెక్టర్రేట్ హాల్లో బీసీ అభివృద్ధి శాఖ అధికారి కేశూరామ్, పద్మశాలీ సంఘం నాయకులు, ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాంనిరాంకుశ వ్యతిరేక ఉద్యమంలో సాయుధ రైతాంగ పోరాట కా లంలో చురుకుగా పాల్గొనడమే గాక న్యాయవాదిగా సేవలందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమం లో బీసీ అభివృద్ధి అధికారి కేశూరామ్, డీఈవో రమేశ్, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జ యరాము లు, ప్రధాన కార్యదర్శి గణపతి, శివశంకర్, బీసీ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారామ్, సహాయ బీసీ అభివృద్ధి అధికారి నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.
సంగారెడ్డిలో బాపూజీ జయంతి
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 27: ప్రత్యేక రాష్ట్ర సాధ న కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజి జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆయన విగ్రహా నికి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ శరత్, జిల్లా ఎస్పీ రమణకుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షీషా, వీరారెడ్డి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మంది రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వ ర్యం లో నిర్వహించిన బాపూజి జయంతిలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు.
ఈ సంద ర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి అన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయ లక్ష్మి, వైస్ చైర్పర్సన్ లతా విజయేందర్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర హరిరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీశ్ పాల్గొన్నారు.