అందోల్, సెప్టెంబర్ 27: అందోల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే కనబడుతున్నదని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రగల్బాలు పలుకుతున్నారని మీ హయాంలో చేసిన పనులపై.. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమా దామోదరా..
అంటూ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాజీ ఉపముఖ్యమంత్రిని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగిన అభివృద్ధిని చూపిస్తానని మీ పార్టీ సర్పంచ్ ఉన్న గ్రామం లో అయినా సరే అభివృద్ధిపై చర్చకు సిద్దమా..? అంటూ సవాల్ విసిరారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ తాను ఎన్నికల సమయంలో పండుగ పబ్బాలకు నియోజకవర్గా నికి వచ్చే ఎమ్మెల్యేను కాదని.. ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తునన్నారు.
ఏండ్లకు ఏండ్లు అధికారంలో ఉన్న మీ పార్టీ ప్రజల కోసం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఏదైనా మంచి జరిగిందంటే అది మీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే అన్నారు. పదేండ్లు ఇక్కడి నుంచి ప్రభుత్వంలో ఉన్న త పదవులు అనుభవించి ప్రజల కష్టాలు తీర్చలేదు గానీ.. మీ ఆస్తులు పెంచుకున్నారన్నారు. మాట్లాడితే కుటుంబ పాలన అని సీఎం కేసీఆర్ను విమర్శించే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ తమ్ముడు, బామ్మర్ది.. భార్య ఇతర కుటుంబ సభ్యులు ఎంతలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో ప్రజలకు తెలుసని, మరోసారి కేసీఆర్ గురించి మాట్లాడే ముందు గతం తెలుసుకుని మా ట్లాడాలన్నారు.
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకరమవుతున్నదన్నారు. పల్లెలు ప్రగతిపథంలో నడుస్తూ గ్రామాలన్నీ పచ్చగా దర్శనమిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు, మాజీ ఉప ముఖ్యమంత్రికి కడుపుమండుతున్నదని.. డిప్రెషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు రోళ్లపాడుకు చెందిన మల్లేశం కుటుంబ సభ్యులకు రూ. 5లక్షల ప్రమాదబీమా చెక్కును అందజేశారు. సమావేశంలో ఎంపీపీ బాలయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, మండలాధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మ న్ ప్రవీణ్, ఆత్మ చైర్మన్ యాదగిరిరెడ్డి, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ, నాయకులు వెంకటేశం, వీరేశం పాల్గొన్నారు.