రామాయంపేట రూరల్, పిబ్రవరి14: నిరుపేదల పాలిట పెన్నిధి సీఎం కేసీఆర్ అని మెదక్ ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేట మండలంలోని ఆర్.వెంకటాపూర్, సుతారిపల్లి, శివాయిపల్లి, డీ.ధర్మారం, కోనాపూర్, రాయిలాపూర్, లక్ష్మాపూర్, అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్, కాట్రియాల, తొనిగండ్ల, దంతేపల్లి, పర్వతాపూర్ గ్రామాల్లో 74 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు. కార్యక్రమంలో రామాయంపేట ఎంపీపీ భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, జడ్పీటీసీ జేరిపోతుల సంధ్య, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ బాదె చంద్రం, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బండారి మహేందర్రెడ్డి, గజవాడ నాగరాజు, సర్పంచ్లు బండారి మ హేందర్రెడ్డి, రాగి సంధ్య, మల్లేశం, శంకర్, నర్సాగౌడ్, జంగం నర్సవ్వ, పంబాల జ్యోతి, రాణెమ్మ, భాగ్యమ్మ, శ్యాములు, బోయిని దయాలక్ష్మి, సురేశ్, సుభాష్తో పాటు నాయకులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత నెలకొంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి తెలిపారు. సోమవారం గవ్వలపల్లిలో నిర్వహించిన రామలింగేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామలింగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూరారంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాదగిరి, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాధవి, రైతుబంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎరుకల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ..
తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం క్యాలెండర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మాదేవేందర్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎరుకల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ కుతడి రాములు, జిల్లా ప్రెసిడెంట్ భిక్షపతి, జనరల్ సెక్రటరీ నవీన్, సంఘం నాయకులు నర్సింహులు, సత్త య్య, సంజీవులు, వెంకటేశ్, శ్రీనివాస్, పెంటయ్య, సంగీత, శ్రీనివాస్, బాలయ్య, నర్సింహులు, బాలమణి, గిరి పోచయ్య, కృష్ణ పాల్గొన్నారు.
నూతన వధూవరులకు ఎమ్మెల్యే ఆశీర్వాదం
కొత్తపల్లి గ్రామానికి చెందిన చెత్రి మల్లయ్య కుమార్తె మౌనిక వివాహానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సోమవారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట మెదక్ జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంజాగౌడ్, శ్రీనివాస్రెడ్డి, శమ్నాపూర్ సర్పంచ్ లింగం, మెదక్ పీఏసీఎస్ డైరెక్టర్ సాయిలు ఉన్నారు.