చిరుప్రాయంలోనే బాలకార్మికులుగా మారినవారు, తల్లిదండ్రుల నుంచి తప్పిపోయినవారు, విద్యకు దూరమైన బాలలను గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ స్మైల్’ మెదక్ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్నది. పోలీసు,లేబర్, మహిళ,శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇటుక బట్టీలు, వాణిజ్య సముదాయాలు, మెకానిక్ షెడ్లు, హోటళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించి బాలకార్మికులు, అనాథలు, వీధి బాలలు, భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించనున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను స్కూళ్లలో చేర్పిస్తారు. అనాథలను చైల్డ్ హోం, వసతి గృహాలకు తరలిస్తారు. జనవరి 31 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో చేపట్టాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్రెడ్డి
ఆయా శాఖలనుఆదేశించారు.
మెదక్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రులకు అప్పజెప్పి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం నేటి నుంచి ఆపరేషన్ స్మైల్-10 కార్యక్రమాన్ని చేపట్టనున్నది. జిల్లాలో మెదక్, తూప్రాన్ రెండు డివిజన్లుగా విభజించి అధికారులు రెండు బృందాలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇటుక బట్టీలు, మెకానిక్ షెడ్లు, హోటళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్లల్లో భిక్షాటన చేసేవారిని, తప్పిపోయిన వారిని, అనాథ, వీధిబాలలను గుర్తించనున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించడం, వసతి గృహాల్లో చేర్పించనున్నారు. అనాథలైతే బాలసదన్, స్వచ్ఛం ద సంస్థలకు అప్పగించనున్నారు. పోలీసు, లేబర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్-10 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రెస్యూ ఆపరేషన్లు చేపట్టి పిల్లలను గుర్తించాక స్టేహోం, చైల్డ్హోం, బ్రిడ్జి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించనున్నారు.
మెదక్ జిల్లాలో మెదక్, తూప్రాన్ రెండు డివిజన్లుగా విభజించి ఆపరేషన్ స్మైల్-10 కార్యక్రమాన్ని ఈ నెల 1 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖల నోడల్ ఏజెన్సీగా మిగతా శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ ముసాన్ చేపడుతారు. ఈ నెల 8వ తేదీ వరకు పిల్లలను చేర్పించేందుకు అనువైన వాతావరణం ఉందా లేదా అని స్టేట్హోం, చైల్డ్ హోం, బ్రిడ్జి సూళ్లను పరిశీలిస్తారు. 9వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు రెస్యూ చేపట్టి పనుల్లో మగ్గుతున్న పిల్లలు, తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన వారిని గుర్తిస్తారు. అనంతరం పోలీసుల సాయంతో తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. బాలకార్మికులుగా వివిధ రకాల పనుల్లో ఉన్న వారిని గుర్తిస్తూ పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానా రూపంలో వచ్చిన నగదును పిల్లల పేరిట బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. తర్వాత తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని పాఠశాలల్లో చేర్పించనున్నారు.
మెదక్ జిల్లాలో ఆపరేషన్ స్మైల్-10 కార్యక్రమాన్ని ఈ నెల 31 వరకు చేపట్టనున్నారు. ఇందుకు జిల్లా పోలీసులు, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖల ప్రధాన పాత్ర పోషించనున్నాయి. పోలీసు శాఖ నుంచి ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్, ఇతర శాఖల నుంచి అధికారులు రెస్యూ బృందాలుగా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఇటుక బట్టీలు, మెకానిక్ షెడ్లు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లల్లో భిక్షాటన చేసేవారిని, తప్పిపోయిన వారిని, అనాథ, వీధిబాలలను గుర్తించనున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులతో మాట్లాడి వసతి గృహాల్లో చేర్పించనున్నారు.
నోడల్ ఏజెన్సీగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆపరేషన్ స్మైల్-10పై జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ మహేందర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాలకార్మికులు ఎవరైనా మీ కంట పడినా, ఎకడైనా పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నా 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్-10 పోస్టర్ను ఆవిషరించారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కరుణశీల, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ నవీన్ కుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు సత్యేంద్రప్రసాద్, యాదయ్య, రాజు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉప్పలయ్య, చైల్డ్లైన్ నోడల్ కోఆర్డినేటర్ అశోక్, ఐసీడీఎస్ బాల నర్సింహులు, డీసీఆర్బీ సీఐ ప్రకాశ్గౌడ్, అధికారులు నవీన్ కుమార్, నాగరాజుగౌడ్, సీఐ దిలీప్ కుమార్, ఏహెచ్టీయూ ఎస్సై మల్లయ్య, ఆపరేషన్ స్మైల్ ఎస్సై శ్రీనివాస్, ఆపరేషన్ స్మైల్ సిబ్బంది పాల్గొన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆపరేషన్ స్మైల్-10 కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తాం. 18 ఏండ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే జేజేబీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం. రెస్క్యూ చేసి పట్టుకొచ్చిన పిల్లలకు ఆశ్రయం కల్పించి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటాం. పోలీసులు, శిశు సం క్షేమ, కార్మిక శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది.