రామాయంపేట, సెప్టెంబర్ 29: ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలని, లిస్టులో తప్పులను సరిదిద్దాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఆయన రామాయంపేటలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా మండల పరిధిలోని ఝాన్సీలింగాపూర్లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిం చి, బీఎల్వోను ఓటర్ లిస్టులో తప్పులను సరిదిద్దాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ర్యాంపు నిర్మాణం చేపట్టాలని రెవె న్యూ అధికారులకు సూచించారు. గ్రామ సర్పంచ్ పంబాల జ్యోతి కలెక్టర్కు మొక్కను అందజేసి శాలువాతో ఘనంగా స న్మానించారు.
అనంతరం రామాయంపేట పట్టణానికి చేరుకు ని పట్టణంలో నూతనంగా నిర్మించనున్న మున్సిపల్ కార్యాలయ స్థలం, డిగ్రీ కళాశాల, ఆర్డీవో భవనాన్ని పరిశీలించి చైర్మ న్, కమిషనర్, తహసీల్దార్ను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. తొందరలోనే డివిజన్కు సంబంధించిన కార్యాలయ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. పట్టణంలో నూతనంగా ప్రారంభించిన డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరుతున్నారా అని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గణపతిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓటరు నమోదు ప్రక్రియ కేంద్రాన్ని పరిశీలించి బీఎల్వోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త ఓటర్ల లిస్టు వ చ్చిందా అని అడిగారు. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.
మున్సిపల్ భవన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్తో మాట్లాడారు. వాస్తు ప్రకారం భవనాలను, రోడ్లను నిర్మాణం చేపట్టాలని సూచించారు. గాంధీ జయంతి రోజున ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలున్నాయని, అంతవరకు పనులన్నీ పూర్తి కావాలని చైర్మన్కు సూచించారు.
కార్యక్రమంలో ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, కమిషనర్ ఉమాదేవి, తహసీల్దార్ రజనీ కుమారి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, పీఆర్ సబ్డివిజన్ అధికారి పాండురంగారెడ్డి, పీఆర్ ఏఈ విజయ్, రైతుబంధు మండలాధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ రామకిష్టయ్య, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్కే హైమద్, పాతూరి ప్రభావతి, అస్నొద్దీన్, దేవుని రాజు, చంద్రపు కొండల్రెడ్డి, కర్రె రమేశ్ తదితరులున్నారు.