మెదక్ మున్సిపాలిటీ, జూన్ 8 : భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి లోపలి ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరె త్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులనుద్దేశించి చర్చి ప్రెసిబేటరీ ఇంచార్జి శాంతయ్య, పాస్టర్లు దైవసందేశం చేశారు. ప్రభువు నమ్ముకున్న వారిని రక్షిస్తాడు, ప్రేమించిన వారిని ప్రేమిస్తాడన్నారు.
యేసుక్రిస్తు సేవకునిగా తన జీవిత విధానాన్ని కొనసాగించరాని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రభువు చూపిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ప్రార్థనల అనంతరం ఫాస్టర్లు భక్తులను ఆశ్వీరదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, సువణ్ డగ్లస్, నోబుల్సన్, జాన్సన్, సంశాన్ సందీప్, ఫాస్టర్లు డేవిడ్, జైపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.