మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 3 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా సందడి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొని యేసయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం చర్చి కాంపౌండ్ ఆవరణలోని చెట్ల కింద వంటవార్పు చేసుకున్నారు. ఈ సందర్బంగా చర్చి ప్రేసిబేటరీ ఇంచార్జీ రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్సుకుమార్ భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రభువు చూపిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు.
ప్రార్థనల్లో చర్చి ఫాస్టర్లు రాజశేకర్, దయానంద్, విజయ్కుమార్, డెవిడ్, జైపాల్, సీఎస్ఐ కమిటీ సభ్యులు రోలాండ్పాల్, సువన్డగ్లస్, ఐవన్, జాయ్ముర్రే, జయరాజ్, స్వామిదాస్, శాంతికుమార్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.