మెదక్ మున్సిపాలిటీ, మే 21: మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.
చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి శాంతయ్య భక్తులనుద్దేశించి దైవసందేశం చేశారు. ప్రార్థనల అనంతరం పాస్టర్లు డేవిడ్, జైపాల్ శ్రీనివాస్, సువర్ణ భక్తులను ఆశీర్వదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, నోబుల్సన్, గెలెన్, జాన్సన్, సువణ్ డగ్లస్, సంశాన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.