మెదక్, జనవరి31(నమస్తే తెలంగాణ): ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం, పంచాయత్ అవార్డులు, మైనార్టీలకు యూనిట్ల మం జూరు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో 50 మందికి తగ్గకుండా ఉపాధి కల్పించాలని, ఆ దిశగా గ్రామాల్లో పనులను గుర్తించాలని సూచించారు. బుధవారం నుంచి కూలీలకు పనులు కల్పించేందుకు పంచాయతీ కార్యదర్శులు, ఏపీఎంలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జిల్లాలో ఇంతవరకు 270 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, మిగతా ప్రాంతాల్లోనూ స్థలాలు ఎంపిక చేసి వెంటనే వాటి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆదర్శ పంచాయతీలను గుర్తించాలి
పంచాయతీ అవార్డులను సమీక్షిస్తూ ఆదర్శమైన పంచాయతీ అంటే 9 (థీమ్) అంశాల్లో సుస్థిర అభివృద్ధి సాధించాలని, అలాంటి పంచాయతీకి కేంద్ర ప్రభు త్వం పంచాయత్ రాజ్ దినోత్సవం సందర్భంగా జాతీ య స్థాయిలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డులు అందజేస్తారన్నారు. 9 థీమ్లు ఇలా.. పేదరికం లేని మెరుగైన జీవనోపాధి గ్రామం, ఆరోగ్యవంతమైన, చైల్డ్ ఫ్రెండ్లీ, నీరు సమృద్ధిగా ఉన్న గ్రామం, పచ్చదనం, పరిశుభ్రత, స్వయం సమృద్ధితో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన గ్రామం, సామాజికంగా సురక్షితమైన గ్రామం, గుడ్ గవర్నెన్స్, మహిళా స్నేహ పూర్వక గ్రా మం. ఇలా ఒక్కో థీమ్లో సుస్థిర లక్ష్యాలు సాధించిన 3 పంచాయతీల చొప్పున 27 పంచాయతీలను ఎంపిక చేసి పంచాయత్ అవార్డుల ఎంపికకు ఎంట్రీలు పంపుతున్నామన్నారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి షార్ట్ లిస్ట్ రూపొందించి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నామన్నారు.
మైనార్టీ వర్గాలకు యూనిట్ల మంజూరు
మైనార్టీ వర్గాలకు యూనిట్ల మంజూరు గురించి సమీక్షిస్తూ 80 శాతం సబ్సిడీతో రూ.లక్ష లోపు 39 యూని ట్ల మంజూరు, 70 శాతం సబ్సిడీతో రెండు లక్షల లోపు 17 యూనిట్ల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించారు. నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల నుంచి 2239 దరఖాస్తులు వచ్చాయని, వాటిని ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారుల జాబితా రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో సాయిబాబా, అధికారి జెంలా నాయక్, మున్సిపల్ కమిషనర్లు జానకీరామ్ సాగర్, మోహన్, వెంకట గోపాల్, ఎంపీవోలు పాల్గొన్నారు.