రామాయంపేట, మార్చి 30: రామాయంపేట, డి.ధర్మారం గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడు నెలల్లో 3752 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యురాలు ఎలిజబెత్రాణి, హెచ్ఈవో రవీందర్, పీహెచ్ఎన్ఎం సత్తమ్మలు తెలిపారు. మంగళవారం డి.ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ వేస్తున్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైనా వ్యాక్సిన్ను వేసుకోవచ్చన్నారు. 60 సంవత్సరాలు దాటిన వారైతే నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో 16మందికి కరోనా వైద్య పరీక్షలు చేయగా 7గురికి పాజిటీవ్గా నిర్ధ్దారణ అయ్యిందన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్త్తూ మాస్కులు, శానిటైజర్లను వాడాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్యామల, సునంద, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు.
కొల్చారంలో 113 మందికి కరోనా వ్యాక్సిన్
కొల్చారం: కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 113 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు మెడికల్ ఆఫీసర్ రమేశ్ తెలిపారు. 60 సంవత్సరాల వయస్సు పైబడినవారితో పాటు 45-60 సంవత్సరాల మధ్య వయస్సు(బీపీ, షుగర్) ఉన్నవారికి వేశామన్నారు. రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమ, మంగళవారాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుదర్శన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కుతో పాటు భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
టీకాను వేయించుకున్న డీపీవో
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డీపీవో తరుణ్కుమార్ మొదటి డోస్ కరోనా టీకాను వేసుకున్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ వెంకట్యాదవ్, పంచాయతీ కార్యదర్శి ఓంప్రకాశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
మాటలతో రెచ్చగొట్టి.. కాసులు కొల్లగొట్టి