హవేళిఘనపూర్, ఏప్రిల్ 19: కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలని బూర్గుపల్లి సర్పంచ్ చెన్నాగౌడ్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు సమావేశం నిర్వహించి గ్రామంలో దుకాణా సముదాయాలు, హోటళ్లు ఉదయం 9గంటల నుంచి 6గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని పాలకవర్గం నిర్ణయించారు. దుకాణాల వద్దకు వచ్చే ప్రజలు రెండు మీటర్ల దూరం పాటించేలా చూడాలన్నారు. ఎవరైనా దుకాణారులు ఈ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో గ్రామ వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
మాస్క్లేకుండా తిరిగితే జరిమానా
మాస్క్లు లేకుండా ఎవరైనా తిరిగితే జరిమానా విధిస్తామని హవేళిఘనపూర్ ఎస్ఐ శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఔరంగాబాద్ తండా చౌరస్తా వద్ద వాహనాదారులకు అవగాహన కల్పించారు. మాస్క్ ధరించకుండా ప్రయాణిస్తే కరోనా సోకే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లే ముందు తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు.
కరోనాతో ఇద్దరు మృతి
కరోనాతో ప్రజాసంఘాల నాయకుడు మృతి చెందాడు. మండల పరిధిలోని గవ్వలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవలే పరీక్ష చేయించుకోగా కరో నా పాజిటివ్గా వచ్చింది. హైదరాబాద్ గాంధీలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. వ్యక్తి మృతిపట్ల టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎస్టీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు చల్మెడ యాదగిరిలు సంతాపం వ్యక్తం చేశారు. గవ్వలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్తో మృతి చెందింది.
కరోనాతో నలుగురు మృత్యువాత
రెండ్రోజుల్లోనే తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలో నలుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. పట్టణంలో నివాసముంటున్న ముగ్గురు వ్యక్తులు,మండలంలోని యావాపూర్లో ఒకరూ మృతి చెందినట్లు తూప్రాన్ పీహెచ్సీ డాక్టర్ ఆనంద్ సోమవారం తెలిపారు.పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు
ఇవీ కూడా చదవండి…