మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 24 : నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలోని 2.20 ఎకరాల స్థలంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. సంబంధిత స్థలాన్ని సైతం మున్సిపాలిటీకి అం దజేసినట్లు పేర్కొన్నారు. గురువారం మార్కెట్లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.30లక్షలతో మార్కెట్లో నిర్మించిన 14 దుకాణాల (బీఫ్) సముదాయాన్ని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కౌన్సిలర్ బొద్దుల రుక్మిణీ కృష్ణతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్కెట్లు పట్టణాభివృద్ధికి మెట్లు అన్నారు. శుభ్రతను పాటించాలని వ్యాపారులకు సూచించారు. శిథిలావస్థకు చేరిన మున్సిపల్ దుకాణాలను కూల్చిన స్థానంలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఆధునికంగా నిర్మిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. షాదీఖానా లో వంటగది నిర్మాణానికి రూ.20 లక్షలు ఎంపీ ప్రభాకర్రెడ్డి మంజూరు చేశారని గుర్తు చేశారు. స్లాటర్ హౌస్ పనులు కొనసాగుతున్నట్లు వివ రించారు. వచ్చే ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని, అప్పటి వరకు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ పనులను పూర్తి చేయాలని సూచించారు.
ముందుగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి తదితరులు మాట్లాడారు. అనంతరం రైతుబజార్లో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జానకీ రాంసాగర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, ఏఎంసీ మాజీ చైర్మన్ మధుసూదన్రావు, కౌన్సిలర్లు శ్రీనివాస్, లలిత, వసంత్రాజ్, మాజీ కౌన్సిలర్లు సోహెల్, గౌస్ఖురేషి, నాయకులు గంగాధర్, కృష్ణాగౌడ్, లింగారెడ్డి, దుర్గాప్రసాద్, జుబేర్, ఉమర్, ముజీబ్ పాలొన్నారు.