మనోహరాబాద్, డిసెంబర్ 9 : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్స్థాయిలో విద్య లభిస్తుందని సర్పంచ్ చిట్కుల మహిపాల్రెడ్డి అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవడంతో పా టు, అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ముంబైలో రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్లో ఆన్లైన్లో నిర్వహించిన జాతీ యస్థాయి పోటీల్లో మనోహరాబాద్ జడ్పీహెచ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభను చాటారు.
జాతీయ స్థాయిలో కార్టున్ మేకింగ్, కలరింగ్, చేతిరాత, స్కెచింగ్, థంబ్, టాటూమేకింగ్, గ్రీటింగ్ కార్డు మేకింగ్ పోటీల్లో 65 మంది పాల్గొనగా, 15 మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇద్దరు విద్యార్థులకు ఆర్ట్మెరిట్ అవార్డులు, మెమెంటోలు, ఆరుగురికి గోల్డ్, నలుగురికి సిల్వర్మెడల్స్, ముగ్గురికి బ్రాంజ్ మేడల్స్తోపాటు సర్టిఫికెట్లు అందజేసినట్లు హెచ్ఎం వెంకటస్వామి వివరించారు.