Manjeera Pushkaralu | న్యాల్కల్, ఏప్రిల్ 26 : గరుడ గంగ కుంభమేళాకు మూడో రోజు బుధవారం భక్తులు పోటెత్తారు. మండలంలోని రాఘవాపూర్ – హుమ్నపూర్ గ్రామ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో గల గరుడ గంగ పూర్ణ మంజీర కుంభమేళా భక్తి పారవశ్యంతో ఓలలాడంది. క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో పూజారులు ఉదయం పంచవటీ క్షేత్రంలోని సరస్వతీ దేవి, షిర్డీ సాయిబాబా, వేంకటేశ్వస్వామి, సూర్యభగవన్, గంగామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.
యాగశాలలో హోమం, పూర్ణ్ణాహుతి, హారతి తదితర పూజలు చేశారు. నాగసాధువులు, దిగంబర సాధువులు, స్వామీజీల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గంగమ్మకు మహా హారతి ఇచ్చారు. పలువురు దాతలు భక్తులకు అన్నదానం చేశారు. ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహారాజ్, అంగడి పేట జీవన్ముక్త ఆశ్రమ పీఠాథిపతి సచ్చిదానంద సద్గురు ఉద్ధవభావ మహారాజ్ భక్తులకు ప్రవచనాలు అందజేశారు. బీడ్ జిల్లా అక్కమహాదేవి భజన మండలి సభ్యులు, మహారాష్ట్రకు చెందిన భజన భక్తి మండలికి చెందిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు: ఆర్డీవో నగేశ్
కుంభమేళాకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఆర్డీవో నగేశ్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. మంగళవారం రాత్రి మంజీర కుంభమేళాను సందర్శించి భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.
29న మంత్రి హరీశ్రావు రాక
ఈ నెల 29 శనివారం రోజున ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో నగేశ్ ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి బుధవారం మధ్యాహ్నం కుంభమేళాకు వచ్చారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్, నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. మంజీర నదిలో భక్తులు స్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా గజ ఈతగాళ్లను నిమించారు. పంచవటీ క్షేత్రం, మంజీర నది తీరంలోని గంగామాత ఆలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఇక్కడకు రావడం అదృష్టం
గురడ గంగ కుంభమేళాకు కుటుంబ సమేతంగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం అదృష్టంగా భావిస్తున్నాం. నాగసాధువులు, సంతులు, భక్తుల కోలాహలాన్ని చూసి భక్తిభావానికి లోనయ్యాం. పంచవటీ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశాం. ఈ కుంభమేళాకు కుటుంబ సభ్యులతో రావడం సంతోషంగా ఉంది.
– కుమారాచారి, అచ్చంపేట, నాగర్ కర్నూల్
అధికారుల పర్యవేక్షణ
పురుషులు, మహిళల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను అందుబాటులో ఉంచారు. తహసీల్దార్ ఆంటోనీ, డీఎల్పీవో రాఘవరావు, మండల అభివృద్ధి అధికారి వెంకట్రెడ్డి, సంబంధిత అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్ ఎస