నోరూరించే మామిడి పండ్ల సీజన్రానే వచ్చింది. వివిధ ప్రాంతాలకు మామిడి పండ్లను ఎగుమతిచేసే ప్రాంతంగా మారింది మన హుస్నాబాద్. స్థానికంగానే మూడేండ్లుగా మామిడి మార్కెట్ నిర్వహిస్తుండటంతో రైతులకు దూరభారంతో పాటు ఖర్చులు సైతం తగ్గాయి. అయితే గత ఏడాదికంటే ఈ ఏడాది అంగూర్పంట దిగుబడి అధికంగా రావడంతో ఎగుమతి తగ్గింది.
హుస్నాబాద్టౌన్, మే 2 : వ్యవసాయంతోపాటు పండ్లతోటలకు హుస్నాబాద్ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. ఒకప్పుడు బత్తాయితోటలకు కేరాఫ్గా నిలిచిన హుస్నాబాద్ ప్రాంతం నేడు వందలాది ఎకరాల మామిడితోటలకు నిలయంగా మారింది. దీంతో అనేకమంది రైతులు మామిడి తోటల సాగుపై దృష్టిసారించారు.
వందలాది ఎకరాల్లో సాగు…
హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, అక్కన్నపేటతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతున్నారు. మామి డి తోటల్లో బంగినపల్లి, దసిరి, ఇమాయిత్ తదితర రకాలు సాగుచేస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పండ్లతోటల సాగు భారీగానే ఈ ప్రాంతంలో విస్తరించింది. స్థానికంగానే మార్కెట్ ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో కొనుగోళ్లు చేపట్టడంతో రవాణా, దూరం, ఖర్చుల భారం తగ్గిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టన్ను రూ. 30 నుంచి రూ. 35 వేలు
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో మామిడికాయల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో రైతుల రాకతో మార్కెట్యార్డు సందడిగా మారింది. గత ఏడాదికంటే ఈ ఏడాది మార్కెట్లో మామిడికాయకు డిమాండ్ తగ్గడంతో ఒకింత ధరలు సైతం తగ్గాయి. అయినప్పటికీ నిత్యం వేలాది టన్నుల మామిడికాయ హుస్నాబాద్ మార్కెట్ను ముంచెత్తున్నది. కరీంనగర్, వరంగల్ మార్కెట్లో లభిస్తున్న ధర కంటే ఎక్కువగానే ఉండటంతో విక్రయించేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. మామిడికాయలు టన్నుకు రూ.30వేల నుంచి రూ. 35వేల వరకు ధర పలుకుతున్నది. స్థానికంగా అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి పంటభారీగానే దెబ్బతినగా, ఆయా రాష్ర్టాల్లో అంగూర్పంట దిగుబడి అధికంగా రావడంతో మామిడికాయల ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ధర సైతం మునుపటికంటే సగం వరకు తగ్గిందని, ఇది మామిడి రైతులకు తీరని నష్టంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు.
వివిధ రాష్ర్టాలకు మనమామిడి ..
మామిడికాయల ఎగుమతికి తెలంగాణ రాష్ట్రం పెట్టింది పేరు. ఇందుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం నుంచే ఉత్తరాది రాష్ర్టాలకు నిత్యం ఎగుమతి చేస్తున్నారు. స్థానికంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడికాయలను ఎప్పటికప్పుడు కూలీలతో బుట్టల్లో ప్యాకింగ్ చేయిస్తున్నారు. ప్యాకింగ్ చేసిన మామిడి కాయలను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యా నా, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ రాష్ర్టాలకు మూడువందల టన్నులకుపైగా మామిడి కాయలు ఎగుమతిచేశారు.
వరంగల్ కంటే ఇక్కడే మంచి ధర
నాకు రెండు ఎకరాల మామిడి తోట ఉన్నది. ఎప్పుడూ వరంగల్కు వెళ్లి మామిడికాయలు విక్రయించేది. హుస్నాబాద్లో మార్కెట్ మొదలైన తర్వాత ఇక్కడికి వచ్చి విక్రయించా. వరంగల్ కంటే ఇక్కడనే ధర మంచిగ పెడుతున్నారు. హుస్నాబాద్లో మార్కెట్ ఏర్పాటు చేయడం రైతులకు మస్తులాభం.
-అందె తిరుపతి, రైతు, మోత్కులపల్లి అక్కన్నపేట మండలం
మామిడికాయలు కొనుగోలు చేస్తున్నాం..
వరంగల్, కరీంనగర్ కంటే ఇక్కడనే ధర ఎక్కువ పెడుతున్నాం. రైతుల కోసమే మార్కెట్ యార్డులో మామిడికాయలు కొనుగోలు చేస్తున్నాం. మంచి ధర ఇస్తున్నారని తెలిసి దూర ప్రాంతాల నుంచి సైతం హుస్నాబాద్ మార్కెట్కు రైతులు మామిడికాయలు తీసుకువస్తున్నారు. గతంలో కంటే ధర మాత్రం తక్కువగా ఉంది. అంగూర్ పంటదిగుబడి అధికంగా రావడంతో మామిడికాయ ధరతగ్గింది. అయినా రైతుల నుంచి కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నాం.
– సందీప్, వ్యాపారి, హుస్నాబాద్ టౌన్
మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలి
మామిడితోటలు ఉన్న రైతులు హుస్నాబాద్లోని మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు రైతులు వెళ్లకుండా ఇక్కడనే కొనుగోలు చేసే విధంగా మార్కెట్ ప్రారంభమైంది. రవాణాచార్జీలు తగ్గడంతోపాటు కొన్న వెంటనే రైతులకు డబ్బులు ఇస్తున్నారు. రోజు ఆయా రాష్ర్టాలకు మామిడికాయలు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ మార్కెట్ ఉండటం మామిడి రైతులకు లాభమే. వరంగల్, కరీంనగర్ కంటే హుస్నాబాద్లోనే మంచి ధర పెడుతున్నారు.
-ఎడబోయిన రజినీతిరుపతిరెడ్డి, చైర్పర్సన్ వ్యవసాయమార్కెట్కమిటీ, హుస్నాబాద్