తూప్రాన్, డిసెంబర్ 1: మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వెళ్లిపోయిన ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావాపూర్ గ్రామానికి చెందిన బక్కని రవి (40) మద్యానికి బానిసయ్యాడు.
మంగళవారం రాత్రి తాగొచ్చి భార్య భాగ్యమ్మతో గొడవపడ్డాడు. అందరు పడుకున్న తర్వాత అదేరోజు అర్ధ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం భాగ్యమ్మ లేచి చూసే సరికి రవి కనిపించలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం యావాపూర్ వాగు గడ్డ మీద రవి చెప్పులు, పాకెట్, ఫోన్ నెంబర్ల పుస్తకం, పాన్కార్డ్ పడి ఉన్నాయి. ఇది గమనించిన గ్రామానికి చెందిన ఎరుకలి భిక్షపతి కుటుంబీకులకు తెలిపాడు. దీంతో భాగమ్మ తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. గురువారం యావాపూర్ హల్దీవాగు పరిసరాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.