నిజాంపేట,జనవరి3 : నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వెళ్లడంతో వ్యక్తి మృతువాత పడ్డ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నగరం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రకాశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరం తండాకు చెందిన పుల్య (39) తన బైక్పై నగరం నుంచి నందగోకుల్ వైపు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో గ్రామ శివారులోని కట్టు కాలువ కల్వర్టు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య కవిత, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రకాశ్గౌడ్ తెలిపారు.