తొగుట డిసెంబర్ 22: పోక్సో కేసులో ఒకరికి రెండేండ్ల జైల్ శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీధర్గౌడ్ తెలిపారు. తొగుట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన అయ్యవారి విజయ్, అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
నేరానికి సంబంధించిన అన్ని సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టారు. గురువారం కోర్టులో విచారణ జిరిగింది. ఇరువురి వాదనలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో అయ్యగారి విజయ్కి రెండు సంవత్సరాల జైల్ శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో నేరస్తుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.