మనోహరాబాద్, సెప్టెంబర్ 07 : అతివేగం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలితీసుకుంది. వేగంగా వెళ్లి చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతరాజుపల్లికి చెందిన మహ్మద్ అక్బర్పాషా (34) అతని బావమరిది అలీబాబాలు బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై గజ్వేల్ వైపు బయలుదేరారు.
మార్గమధ్యలో తూప్రాన్ మండలం ఘనాపూర్ స్టేజీ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో మహ్మద్ అక్బర్పాషా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా అలీబాబాకు గాయాలయ్యాయి. మృతుడికి భార్య షాహేదాబేగం, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.