మెదక్ అర్బన్, అక్టోబర్ 29 : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన జిల్లా కేంద్రంలోని కుమ్మరిగడ్డలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మెదక్ పట్టణ సీఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ పట్టణానికి చెందిన కుమ్మరి రవిని (35), అన్న శ్రీనివాస్, తండ్రి లక్ష్మయ్యలు కలిపి రోకలి బండతో దాడి చేయగ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
మృతుడి భార్య , బిడ్డ గత సంవత్సనం చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారని అప్పటి నుంచి మృతుడు మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని తెలపారు. హత్య చేసిన వ్యక్తులు ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. మెదక్ పట్టణ వీఆర్వో ఫిర్యాదు మేరకు మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకోని ధార్యప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్ తెలిపారు.