కొమురవెల్లి, జనవరి 31: పిల్లల్లో పోషణ లోపాన్ని గుర్తించి వారికి బాలామృతం ప్లస్ ఇవ్వాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గౌరాయపల్లిలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సర్పంచ్ సద్ది కృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు. దానిలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో తీవ్ర పోషణ లోపాన్ని గుర్తించాలని సూచించారు.
ప్రతినెలా పిల్లల వయస్సును బట్టి బరువు, ఎత్తు చెక్ చేయాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించడంతో పాటు విద్యార్థులను పాఠ్యాంశాల్లోని పలు ప్రశ్నలు అడుగగా వారు సరైన సమాధానం చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని నర్సరీ, డంపింగ్ షెడ్ను పరిశీలించారు. డీడబ్ల్యూవో రామ్గోపాల్రెడ్డి, సీడీపీవో శారద, ఎంపీడీవో అనురాధ, సూపర్వైజర్ పావని, ఎంపీటీసీ కొయ్యడ రాజమణి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.