చేగుంట, మార్చి 4: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేటలో కేతకీ భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి ఆలయ ఆరో వార్షికోత్సవాన్ని యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవం, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. సాయంత్రం బోనాలు, అగ్నిగుండ ప్రవేశం, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు, తీర్థప్రసాదం, అన్నదానం చేశారు.
ఈ వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ సంతోష్కుమార్, సొసైటీ చైర్మన్ కొండల్రెడ్డి, అశోక్రెడ్డి, మోహన్రెడ్డి, నాయిని రాజ్గోపాల్, బీఆర్ఎస్ నాయకుడు నాగరాజు, అలం శ్రీ కాంత్, అలీ, యాదవ సంఘం నాయకులు ఎర్ర కిష్టయ్య, యాదయ్య, మల్లేశ్, సత్తయ్య, నాగరాజు పాల్గొన్నారు.
కర్నాల్పల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద ఐకే పీ శ్వేత శంకర్ కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.